ఎన్నికను నిరవధికంగా వాయిదా వేయిన ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి.... కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, ఇతర సభ్యులు మాత్రం కార్యాలయం లోపలే ఉన్నారు. ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందని అధికారి శివన్నారాయణ రెడ్డి తెలిపారు. తాము ఎంతగా సర్ది చెప్పినా కూడా సభ్యులు వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుతం కొండపల్లి కౌన్సిల్ ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు అధికారి. అందుకే ఎన్నికను వాయిదా వేసినట్లు శివన్నారాయణ రెడ్డి వెల్లడించారు. టీడీపీ సభ్యులు కార్యాలయం లోపలే ఉన్నారు కదా ప్రశ్నిస్తే మాత్రం... ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా పాలక వర్గం ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఎన్నికను నిరవధికంగా వాయిదా వేయిన ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి.... కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, ఇతర సభ్యులు మాత్రం కార్యాలయం లోపలే ఉన్నారు. ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందని అధికారి శివన్నారాయణ రెడ్డి తెలిపారు. తాము ఎంతగా సర్ది చెప్పినా కూడా సభ్యులు వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుతం కొండపల్లి కౌన్సిల్ ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు అధికారి. అందుకే ఎన్నికను వాయిదా వేసినట్లు శివన్నారాయణ రెడ్డి వెల్లడించారు. టీడీపీ సభ్యులు కార్యాలయం లోపలే ఉన్నారు కదా ప్రశ్నిస్తే మాత్రం... ఏ మాత్రం సమాధానం చెప్పకుండా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా పాలక వర్గం ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.