ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ తర్వాత ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి వస్తుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘంతో ఇవాళ ఓ ప్రకటన ఇప్పించింది. పీఆర్సీ పై ఓ వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ప్రకటించారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు తప్పకుండా వస్తుందన్నారు వెంకట్రామిరెడ్డి. ఈ సమావేశంలో పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు కోరే అవకాశం ఉంటుందని తెలిపారు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు 40 శాతం ఫిట్ మెంట్ కోరాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. 2020 నుంచి నగదు రూపంలో తమకు రావాల్సిన బకాయిలను కోరనున్నట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న హెచ్ఆర్ఏను ఏ మాత్రం తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ తర్వాత ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి వస్తుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘంతో ఇవాళ ఓ ప్రకటన ఇప్పించింది. పీఆర్సీ పై ఓ వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ప్రకటించారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు తప్పకుండా వస్తుందన్నారు వెంకట్రామిరెడ్డి. ఈ సమావేశంలో పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు కోరే అవకాశం ఉంటుందని తెలిపారు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు 40 శాతం ఫిట్ మెంట్ కోరాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. 2020 నుంచి నగదు రూపంలో తమకు రావాల్సిన బకాయిలను కోరనున్నట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న హెచ్ఆర్ఏను ఏ మాత్రం తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.