ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ది జరుగుతుందన్నారు వైఎస్ జగన్. పేదలకు తాము నివసించే ఇళ్లపై చట్టపరమైన హక్కులు వస్తాయని కూడా అన్నారు. పేదలకు మేలు చేసే పథకంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. లబ్దిదారుల్లో ఉన్న సందేహాలను, అనుమానాలపై అధికారులే స్వయంగా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ఓటీఎస్ ద్వారా రిజిస్టర్ పత్రాలతో లబ్దిదారులకు అసలు, వడ్డీ మాఫీ అవుతాయని... ఆ వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. అయితే కేవలం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే ఓటీఎస్ పథకం అమలు చేయాలన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.
ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ది జరుగుతుందన్నారు వైఎస్ జగన్. పేదలకు తాము నివసించే ఇళ్లపై చట్టపరమైన హక్కులు వస్తాయని కూడా అన్నారు. పేదలకు మేలు చేసే పథకంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. లబ్దిదారుల్లో ఉన్న సందేహాలను, అనుమానాలపై అధికారులే స్వయంగా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ఓటీఎస్ ద్వారా రిజిస్టర్ పత్రాలతో లబ్దిదారులకు అసలు, వడ్డీ మాఫీ అవుతాయని... ఆ వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. అయితే కేవలం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే ఓటీఎస్ పథకం అమలు చేయాలన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.