తొలిదశలో 40 వేల ఈవీల ఉత్పత్తి..
మొదటి దశలో 40 వేల ఈవీ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, దశలవారీగా రెండేండ్లలో లక్ష యూనిట్ల సామర్థ్యాన్ని కంపెనీకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు వన్ మోటో తెలిపింది. తొలిదశలో యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి.. పరోక్షంగా 2వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ఇండియా సీఈవో శుభంకర్ చౌదరి వెల్లడించారు. ఈవీల ఉత్పత్తినే కాకుండా విడిభాగాల తయారీ, అప్డేట్, రీసైక్లింగ్పై కూడా కంపెనీ దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ఈవీ సర్వీస్ సేవలను నిర్వహించేందుకు గాను యువతకు అందుకుతగిన నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వాలని కూడా యోచిస్తున్నది. తద్వారా గ్రామీణ యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇదే సమయంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ సమక్షంలో మూడు వన్ మోటో మోడల్స్ను లాంచ్ చేశారు.