ఇదే సమయంలో ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోందని, గోవాలో బీజేపీ హవా కొనసాగబోతోందని ఈ సర్వేలో తేలింది. గోవాలో బీజేపీకి 37 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 9, కాంగ్రెస్కు 8 సీట్లు రావొచ్చని సర్వే చెప్పింది. పంజాబ్లో మాత్రం బీజేపీ ఆశించిన ఫలితాలు రావని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా బలపడి 58 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి 43, శిరోమణి అకాళీదళ్కు 23 స్థానాలు వచ్చే అవకాశముండగా, బీజేపీ కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చని తేలింది. మొత్తంమీద యూపీలో తీవ్ర పోటీ ఉన్న కారణంగానే బీజేపీ అక్కడ ఒడ్డెక్కేందుకు హిందూ ఓట్లను సంఘటితం చేసే ప్రయత్నాల్లో పడిన విషయం తెలిసిందే. అక్కడ ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమేనని చెప్పాలి.
ఇదే సమయంలో ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోందని, గోవాలో బీజేపీ హవా కొనసాగబోతోందని ఈ సర్వేలో తేలింది. గోవాలో బీజేపీకి 37 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 9, కాంగ్రెస్కు 8 సీట్లు రావొచ్చని సర్వే చెప్పింది. పంజాబ్లో మాత్రం బీజేపీ ఆశించిన ఫలితాలు రావని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ భారీగా బలపడి 58 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి 43, శిరోమణి అకాళీదళ్కు 23 స్థానాలు వచ్చే అవకాశముండగా, బీజేపీ కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చని తేలింది. మొత్తంమీద యూపీలో తీవ్ర పోటీ ఉన్న కారణంగానే బీజేపీ అక్కడ ఒడ్డెక్కేందుకు హిందూ ఓట్లను సంఘటితం చేసే ప్రయత్నాల్లో పడిన విషయం తెలిసిందే. అక్కడ ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమేనని చెప్పాలి.