వైసీపీలో ఎంపీ మార్గాని భరత్ రూటే సెపరేట్ అన్నట్లు ఉంటుంది..ఎంతసేపు పబ్లిసిటీతో ముందుకెళ్లడం భరత్‌కు బాగా అలవాటు అని చెప్పొచ్చు. ఏ నాయకుడైన ప్రజా మద్ధతు పొందాలంటే ప్రజలకు సేవ చేస్తే చాలు...కానీ సేవ చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుంటే మాత్రం ఉపయోగం ఉండదు...ఈ విషయం భరత్ విషయంలో రుజువు అవుతుందని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో లేనిపోని పబ్లిసిటీ స్టంట్స్ చేసి భరత్ బుక్ అయిపోతున్నారు.

ఈయన పబ్లిక్‌లో ఎంతసేపు ఉంటారో తెలియదు గాని..పబ్లిసిటీలో మాత్రం ఎక్కువసేపు ఉంటున్నారని అంటున్నారు..అందుకే ఈయనపై తమ్ముళ్ళు ఎక్కువ సెటైర్లు పేలుస్తున్నారు. ఇక తమ్ముళ్ళు మాత్రమే కాదు...వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం..భరత్‌పై సెటైర్లు వేసేస్తున్నారు. ఈ మధ్య రాజు గారు, భరత్‌ల మధ్య చిన్నపాటి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పటినుంచో రఘురామపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇక విప్‌గా ఉన్న భరత్‌పై ఈ బాధ్యత ఎక్కువ ఉంది...అందుకే ఆయన ఎప్పుపడితే అప్పుడు లోక్‌సభ స్పీకర్‌ని కలిసి రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. అయితే ఎవరెన్ని చేసినా తనపై అనర్హత వేటు మాత్రం వేయించలేరని రఘురామ అంటున్నారు...అలాగే తనపై అనర్హత వేటు వేయించలేనని ఒప్పుకుంటే తానే రాజీనామా చేస్తానని రఘురామ చెప్పుకొస్తున్నారు.

వైసీపీకి భయపడి రఘురామ, రాజీనామా అంటున్నారని భరత్ కామెంట్లు చేస్తున్నారు...అయితే ఏకచిత్ర నటుడు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, తాను ఎవరికి భయపడేది లేదని చెప్పి రఘురామ, భరత్‌పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇలా భరత్ అనవసరంగా తనపై సెటైర్లు వేసేలా చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇలా అవ్వడం వల్ల భరత్ ప్రజల్లో చులకన అయ్యే అవకాశాలు ఉంటాయి...ఇప్పటికే పబ్లిసిటీతో చులకన అవుతున్నట్లు కనిపిస్తున్నారు....రఘురామ విషయంలో మరింత ఎక్కువ అవుతున్నారు. ఇలా ప్రతిదానికి రఘురామ బుక్ అయిపోతున్నారు..ఇది ఇలాగే కొనసాగితే నెక్స్ట్ మార్గాని భరత్ పోలిటికల్ కెరీర్‌కే ఇబ్బంది అయ్యేలా ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: