రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులు గెలవడం అసాధ్యమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కేసీఆర్ కు ఈ విషయంలో ఏమి చెయ్యాలి అన్నది పాలుపోవడం లేదట. ఇది తెరాస లో కలకలం రేపుతోంది. కానీ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈయన సలహా ప్రకారం ప్రజల్లో మంచి పేరు లేని ఎమ్మెల్యే లేదా ఎంపీ లకు సీట్ ఇవ్వకూడదని చెప్పారట. ఇందుకు కేసీఆర్ కూడా సరే అన్నట్లు తెలుస్తోంది, రాబోయే ఎన్నికలకు సంబంధించిన పూర్తి హక్కులు పీకే కి అప్పచెప్పారట.
దీనిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే లు సీటు కోల్పోతారు. అందుకే ఆ ఎమ్మెల్యేలు అంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ ను కలిసి కాకా పట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. కొందరు అయితే ఇండిపెండెంట్ గా అయినా నిలబడి గెలవాలని ధీమాతో ఉన్నారట. మొత్తానికి ఎన్నికలకు ముందే తెరాస ఎమ్మెల్యేలు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. అయితే ఎమ్మెల్యేలలో ఏర్పడిన ఈ కొత్త వణుకుకు కారణం మాత్రం ముమ్మాటికీ ప్రశాంత్ కిషోర్ అని చెప్పాలి.