ఇక తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రకాల బయోపిక్‌లు తెరకెక్కాయి. ఇంకా ఎందరో మహానటుల జీవితాల్ని సినిమాలుగా కూడా తీశారు. మరెందరో మహనీయుల జీవితాల్ని చక్కగా వెండితెరపై చూపించారు.అయితే ఇక తాజాగా టాలీవుడ్‌లో మరో బయోపిక్ అనేది ఇప్పుడు టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. టాలీవుడ్ లో మరో క బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈసారి ఓ రాజకీయ నేతపై ఆ బయోపిక్ రానుంది. ఏపీలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ జీవిత చరిత్రని బేస్ చేసుకోని ఈ బయోపిక్ ను నిర్మించనున్నారు.ఇక ఈ సందర్భంగా నందిగం సురేశ్ మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు తన బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. నెల రోజుల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ బాగా ప్రశంసలు కురిపించారు. సామాన్యుడినైన తనను జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపీని చేశారన్నారు నందిగం సురేశ్. ఇది దళితులకు ఇచ్చిన చక్కటి గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. టీడీపీ చేసిన దారుణాలు ఇంకా అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఈ సినిమా కథ ఉంటుందని నందిగం సురేశ్ తెలిపారు.


ఇంకా అలాగే అమరావతి విషయంలో కూడా దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఈ సినిమా ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దళితులకు జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని పలు ప్రశంసలు కురిపించారు. టీడీపీ చేసిన దారుణాలు ఇంకా అలాగే వైసీపీ(ycp) ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఈ సినిమా కథ ఉంటుందని నందిగం సురేశ్ తెలిపారు. ఇంకా అలాగే దళితులకు జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో రకాల బయోపిక్ లు తెరకెక్కాయి.ప్రముఖ నటులు, దివంగత సీఎం నందమూరి తారక రామరావు గారి జీవితాన్ని కూడా ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కించారు. అలాగే చాలా మంది నటీనటుల జీవితాల్ని కూడా సినిమాలు తీశారు, మహా నటి సావిత్రి, సిల్క్ స్మిత ఇంకా అలాగే జయలలిత వంటి హీరోయిన్ల జీవితాల్ని కూడా తెరపై చూపించారు. కాగా ఇక ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ రోల్ లో ఉన్న వైసీపీ ఎంపీ జీవిత చరిత్ర తెరకెక్కనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: