తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చతురత గురించి తెలిసినవాళ్లు తెగ పొగిడేస్తుంటారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే లు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే ఎలాంటి వారు సలహాలు ముఖ్యమంత్రి తీసుకుంటారని గవర్నర్ అన్నారు.