ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాల్లో  శరవేగంగా వృద్ధి చెందుతు ఎంతోమందిని ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ పై  పోరాటం చేస్తోంది. కనిపించని శత్రువును తరిమి కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ కరోనా  వైరస్ వెలుగులోకి రాగానే... కరోనా  వైరస్ గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వందేలా ఏళ్ళ  క్రితమే చెప్పారు అంటూ ఎంతో మంది ప్రజలు చర్చించుకున్న  విషయం తెలిసిందే. కోరంకి  అనే  విశగాలి  పుట్టెను అంటూ కాలజ్ఞానం లో ఉన్న ఓ పద్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఒక పండితుడు కూడా కరోనా  వైరస్ గురించి ముందుగానే  ఊహించి చెప్పారు జ్యోతిష్య శాస్త్రంలో. శ్రీకాళహస్తి దేవస్థానం పండితుడిగా... ఖగోళ వాస్తు శాస్త్రాల్లో  ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. 

 

 ఈయన  ఎన్నో ఏళ్ల నుంచి సామాజిక, రాజకీయ, క్రీడా సాంస్కృతిక సినిమాలా ఎన్నో అంశాలపై ముందుగానే పంచాంగంలో ఉన్న  ఫలితాలను వెల్లడించారు. ఈయన చెప్పిన జోస్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఫలించింది . ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీ ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ సిద్ధాంతి గారు కరోనా వైరస్ గురించి కూడా శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం లో తెలియజేసినట్లు తెలుస్తోంది. శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం లో ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారు నవగ్రహ  సంచారా  భాష్యాలు అనే దానిలో... 2019లో కొత్త వైరస్ వస్తుందని దేశం మొత్తాన్ని వనికిస్తుంది అంటూ పేజి నెంబర్ 277 పెద్ద పంచాంగంలోని 176 వ పేజీలో వివరించారు. 

 

 

 అయితే సిద్ధాంతి గారూ  చెప్పినట్లు గానే  ప్రస్తుతం కరోనా  వైరస్ భారతదేశంలోకి ప్రవేశించి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ వైరస్ వల్ల దేశం  మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. కేవలం దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం గడగడలాడిస్తున్నది  ఈ మహమ్మారి వైరస్. వైరస్ బారిన పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సిద్ధాంతి గారు రామజన్మభూమి విషయంలో 2019లో స్పష్టమైన తీర్పు వస్తుందనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఇక రాజకీయంగా కూడా ఈ సిద్ధాంతి గారు చెప్పిన జ్యోష్యం ఎన్నోసార్లు ఫలించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: