రోజా.. ఫైర్ బ్రాండ్.. వైసీపీ పార్టీ లో మహిళా నేతల్లో బలమైన లీడర్ ఎవరంటే రోజా పేరు తప్పకుండా చెప్పొచ్చు.. తన విమర్శలతో సీఎం గా ఉన్న చంద్రబాబు నే అప్పట్లో గడగడలాడించింది. చంద్రబాబు ను ఎవరైనా గట్టిగా విమర్శించారంటే అది రోజా ఒక్కరే అని చెప్పాలి.. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు వెలిచారు.. 2014 లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన రోజా 2019 అయన వారసుడు గాలి భాను ప్రకాష్ మీద భారీ మెజారిటీ తో గెలిచారు.. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణం తో టీడీపీ ఆ టికెట్ ను అయన వారసుడికి ఇచ్చారు..

ఇక మొదటినుంచి పార్టీ లో కీలక పాత్ర పోషించిన రోజా కి ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.. రెండవసారి చేసే మంత్రి వర్గ విస్తరణలో అయినా ఆమెకు చోటు దక్కుతుందో చూడాలి.. ఇక ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడమే మంచిది అంటున్నారు నగరి వాసులు.. మంత్రి పదవి వస్తే ఆమె తనకున్న రాష్ట్రాభివృద్ధి పనులతో నే సరిపోయేది నగరి లోని ప్రజల బాగోగులు చూసుకునేవారు కాదు.. అంటున్నారు..

ప్రస్తుతం ఆమె నగరి ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఏ లోటు రానివ్వట్లేదు.. దాంతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పలుకుతున్నారు.. దీంతో అక్కడ టీడీపీ నాయకులూ సైతం రోజా పనితనానికి ముగ్దులవుతున్నారట.. టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి వారసుడు కూడా నగరి లో ఎక్కువ గా కనిపించకపోవడం రోజా కు కలిసొచ్చే అంశం.. ఇక ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: