ఇక నిన్న ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఊరట లభించినట్లయింది. అయితే మరోవైపు ప్రజల్లో భయం కూడా నెలకొంది. ఆర్టీసీ బస్సుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కడ జరుగుతుందో అని భయం కూడా ప్రజల్లో నెలకొంది. అయితే ఆరు నెలల నుంచి డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నిన్న రోడ్డెక్కాయి . నగరంలోని ప్రతి డిపో నుంచి 25 శాతం బస్సులు తిరిగాయి.
కానీ ఆర్టీసీ బస్సు లో మాత్రం ఒక ప్రయాణికుడు కూడా ఎక్క లేదట. దీంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్సులు వెలవెలబోయినట్లు తెలుస్తుంది. ఇంతకీ దీనికి కారణం ఏమిటి అని అంటారా... మొత్తం నగరంలో 29 డిపోల నుంచి 639 ఆర్టీసీ బస్సులను తిప్పారు. ప్రయాణికుల నుంచి రెస్పాన్స్ కనిపించలేదు.. దీనికి కారణం ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే అని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆర్టీసీ ప్రయాణికులకు రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి