విశాఖ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతతో వారు చర్చిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే త్వరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వైసిపి తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. వీరిద్దరూ కూడా పదవులకు రాజీనామా చేసే వెళ్లడానికి రెడీ అవుతున్నారట. అయితే మీడియాలో మాత్రం వార్తలు రాలేదు. అయితే వారిద్దరూ రావడానికి సీఎం జగన్ అంగీకారం తెలిపిన సరే...
కొంతమంది వైసీపీ నేతలు మాత్రం రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర ఇప్పుడు తెలుగుదేశంను వీడే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఆయన సోదరుడు మస్తాన్ రావు ఇప్పటికే వైసీపీ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి రవిచంద్ర ఎప్పుడు పార్టీ మారుతారు అనేది చూడాలి. ఇక పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షుల విషయంలో చంద్రబాబు వైఖరితో సీరియస్ గా ఉన్న కొంతమంది యువ నేతలు కూడా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కూడా త్వరలోనే ఒక స్పష్టత రానుంది.