కానీ గృహిణి తెలివితేటలతో ఏకంగా దొంగలు సైతం షాక్ అయ్యారు. ఎంతో కష్టపడి తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలకు కనీసం కొంచెం కూడా బంగారం దొరకకుండా ఆ గృహిణి ఎంతో తెలివిగా ప్లాన్ చేసింది. దీంతో దొంగతనానికి వెళ్ళి చిల్లర తో సరిపెట్టుకున్నారు దొంగలు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ సూర్య నగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది.. సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఇంట్లోకి వెళ్లి చూడడంతో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇక బీరువాలో ఉన్న చీరలను అన్నింటిని కూడా చోరీ చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. ఇంటి యజమానులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి చెప్పారు.
అయితే ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు ఉండడంతో అంతా చోరీకి గురై ఉంటాయని గృహిణి భావించింది. ఇక వెంటనే సొంతూరు నుంచి సాయంత్రానికి నగరానికి తిరిగి వచ్చారు యజమానులు. నేరుగా నగలు దాచిపెట్టిన ప్రదేశంలో వెతికారు. ఇక ఆమె దాచిపెట్టిన బంగారం మొత్తం ఎంతో సేఫ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇంట్లో దొంగలు పడినా వారికి బంగారు దొరకకుండా గృహిణి చేసిన ఆలోచనకు అందరూ ఫిదా అయిపోయారు. ఎలాగో దొంగలు బీరువాలో చీరాల మధ్య వెతుకుతారు అని భావించి ఒక రహస్య ప్రాంతంలో గృహిణి నగలు దాచినట్టుగా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి