ఈ వార్త రైతులకు శుభవార్త అనే చెప్పాలి.. పీఎం కిసాన్ పథకం కింద మరో విడత డబ్బులు అందించేందుకు సిదమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ స్కీమ్ కింద నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 7 విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 8వ విడత డబ్బులు అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల చివరి నాటికి రైతులకు ఈ డబ్బులు అందే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు డబ్బులని అందిస్తోంది.
ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు రైతులకు అందుతున్నాయి. ఇప్పుడు 8వ విడత డబ్బులు రానున్నాయి. దేశవ్యాప్తంగా 11.27 కోట్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. మీరు ఇప్పటికీ కూడా ఈ స్కీమ్లో చేరకపోతే ఇప్పుడైనా చేరే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటికే చేరి ఉండి కూడా డబ్బులు రాకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలి. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ స్టేటస్ను సులభంగా తెలుసుకోవచ్చు.. ఇప్పుడు మరో పథకాన్ని కూడా మరో పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి