భారతదేశంలో కరోనా రోజు రోజుకి చాప కింద నీరు లాగా వ్యాపిస్తుంది.రోజు రోజుకి కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. అధికారులు, డాక్టర్లు అదుపు చెయ్యలేక అల్లాడిపోతున్నారు.ఇక కరోనా ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా కష్టపడి పని చేస్తున్నారు. సరిగ్గా ఎలాంటి రక్షణ సౌకర్యాలు లేకున్నా కాని ఎంతో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను పలువురు సొంతంగా కొనుగోలు చేస్తుండగా అనేకమంది అవేమీ లేకుండానే సేవలు కొనసాగిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రోజుకి 2 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కేసుల్లో అత్యధిక పాజిటివ్‌ కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి.కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో జిల్లా వ్యాప్తంగా 4,500 మంది ఆశలు, సుమారు 5 వేల మంది ఎఎన్‌ఎంలు పనిచేస్తున్నారు.


ప్రతి 1000 మంది జనాభా పరిధిలో పని చేసే ఒక్కో ఆశ, ఎఎన్‌ఎంలకు నిత్యం 250 నుండి 300 ఇళ్లను సందర్శించి, సర్వే నిర్వహించాల్సి ఉంది. పాజిటివ్‌ బాధితులను ఆస్పత్రులకు తరలించే సమయంలో అతి సమీపంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి డాక్టర్ల సూచనల మేరకు మందులు, ఆహారం అందిస్తున్నారు. కిట్లను బాధితుల వద్దకు చెరవేస్తున్నారు. కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆశ వర్కర్లు రోజుకు రెండు మాస్కులు వినియోగించాల్సి ఉండగా సెకండ్‌ వేవ్‌ మొదలైన రెండు నెలల కాలంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇచ్చే అరకొర వేతనాల్లో సొంతంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని పలువురు తమ బాధని వ్యక్తం చేస్తున్నారు.ఖచ్చితంగా ప్రభుత్వం వారికి మంచి వేతనాలు ఇవ్వాలి.ఎందుకంటే ఈ సమయంలో వారు చాలీ చాలని జీతాలతో తెగ కష్టపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: