ఈ మధ్య కాలంలో మనుషుల కాస్తా మానవత్వం లేని మనుషులుగా మారిపోతున్నారు.  రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజం సభ్యసమాజం ఉలిక్కి పడేలా  చేస్తున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి విషయంలో మరో వ్యక్తి దారుణంగా వ్యవహరించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.





 సాగర్ జిల్లాలో దామోదర అనే వ్యక్తి నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఇంటి సమీపంలో ఉండే వ్యక్తి తో ఏదో కారణమై గొడవ జరిగింది. గొడవలో గాయాలపాలైన దామోదర్ ఆసుపత్రిలో చేరారు. అయితే దామోదర తో గొడవ పెట్టుకున్న మరో వ్యక్తి మాత్రం అతనిపై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు.  ఈ క్రమంలోనే గాయాల బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దామోదర్ ను హతమార్చాలి అనుకున్నాడు. దీనికోసం పక్కా ప్లాన్ కూడా వేసాడు. ఈ క్రమంలోనే ఇక నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. ఇక ఆస్పత్రికి వెళ్లిన సమయంలో తన వెంట బాటిల్లో పెట్రోల్ కూడా తెచ్చుకున్నాడు.





 ఇక ఆస్పత్రిలో కి వెళ్ళిన తర్వాత అక్కడ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ దామోదర్ మీద పోసి నిప్పాంటించాడు. దామోదర్ మంటల్లో  కాలిపోతున్న సమయంలో అక్కడి నుంచి పరుగులు పెట్టాడు  అయితే ఇదంతా అక్కడి ఆస్పత్రి సిసిటివి ఫుటేజీలో రికార్డ్ కావడంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సిసిటివి ఫుటేజీ పరిశీలించారు..  ఇక సిసిటివి ఫుటేజీలో దామోదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించింది మిలన్ రజాక్ అనే వ్యక్తి అనే విషయాన్ని గుర్తించారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం బాధితుడు బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: