సిఎం కెసిఆర్, కేటీఆర్ లపై  కాంగ్రెస్ టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  డ్రగ్స్ కేసు లో హాజరు అవుతున్న సెలెబ్రెటీస్ కి బ్రాండ్ అంబాడిసర్ కేటీఆర్ అని..తాగుబోతుల కి కేసీఆర్ బ్రాండ్ అంబాడిసర్ అని  అన్నారు రేవంత్ రెడ్డి. ఆదాయం కోసమే ప్రభుత్వాన్ని కెసిఆర్ నడుపుతున్నాడని పేర్కొన్నారు.  కేసీఆర్ మానవ మృగంగా మారాడని.. 19 నెలలో రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.    టీ ఆర్ ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని తెలిపారు.  2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారని.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నిజాం రజాకారులు ను ఇదే రోజు తరిమి కొట్టారని పేర్కొన్నారు.  

మల్లన్న సాగర్ లో 60 వేలు ఎకరాలు భూమి తీసుకుని 14 గ్రామాలుని ముంచారని.. కొండ పోచమ్మ సాగర్ లో తమ బంధువులు  భూమి కాపాడడం కోసం పేదలు భూమి ని లాక్కొన్నారన్నారు.  మెదక్ ప్రజలు ఆదరించి ఎంపీ చేయడం వలన ఇందిరా గాంధీ ప్రధాని అయిందని.. నాలుగు కోట్ల ప్రజలు విముక్తి కోసం, పార్టీ ప్రయోజనాలు వదిలేసి తెలంగాణ ఇచ్చిందని పేర్కొన్నారు.  పార్టీ ని విలీనం చేస్తానని మోసం చేసిన దగుల్బాజీ కేసీఆర్ అని..  అర శాతం జనాభా ఉన్న కేసీఆర్ ఇంట్లో నాలుగు పదవులు ఉన్నాయని స్పష్టం చేశారు.  12 శాతం ఉన్న మాదిగలు కి మంత్రి పదవి ఇవ్వలేదని.. ఇందిరా గాంధీ  ఇచ్చిన పోడు భూములను హరిత హారం పేరు తో లాక్కొన్నారన్నారు.  

సన్న బియ్యం, చేప పిల్లలు, గొర్రెలు కోసం యువకులు ప్రాణ త్యాగము చేయలేదని.. కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణం అయ్యాడని వెల్లడించారు.  కేసీఆర్ సీఎం అయ్యాక  4632 బడులు ను మూసి వేయించాడని.. ముస్లిం లకు 12 శాతం ఇస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు అయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కాడని... తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది మద్యం ఆదాయం 10883 కోట్లు.. కానీ ఇప్పుడు 36000 కోట్లు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. మద్యం ఆదాయం 300 శాతం పెరిగిందని.. తుది దశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలని తెలిపారు.  రాబోయే 19 నెలలు తెలంగాణ భవిషత్తు ను డిసైడ్ చేయబోతోందని..

మరింత సమాచారం తెలుసుకోండి: