బూతులు మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యే లు సహ అనేక మంది మా పార్టీ నాయకులు అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారు క్షమాపణ కోరితే మనం అయ్యన్న పాత్రుడు అన్న మై సన్ అన్న దానికి చంద్రబాబు నాయుడు గారిని అడగవచ్చు అని అన్నారు ఆయన. నన్ను జోగి రమేష్ లుచ్చా, వెదవ అని తిట్టినందుకు జగన్ గారు కితాబు లు ఇచ్చారు కదాఅని గుర్తు చేసారు. మొత్తం దీని వెనుక ఎవరూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అన్న ఆయన... లుచ్చా, వెదవ అని తిట్టి గతం లో అభినందలలు అందుకొని పులకించిన జోగి మంత్రి పదవి కోసమే మళ్లీ దాడికి దిగబడ్డాడు అని విమర్శించారు.
మై సన్ అనేదనికే మనం క్షమాపణలు కోరితే ఇంతకంటే దారుణంగా మన మంత్రులు, ఎమ్మెల్యే లు, నాయకులు మాట్లాడిన దానికి ప్రతిపక్షాల వాళ్ళు రాళ్లు పుచ్చుకొని తాడేపల్లి కి వస్తే అని ప్రశ్నించారు. బేషరతు గా ముందు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేసారు. జోగి ని లుచ్ఛా అనటం ఎంతసేపు కాని నేను యోగిని అన్నారు. నన్ను బ్రతిమలాడి పార్టీలో కి తీసుకుంది ఎవరో ఒక సారి జగన్ గారిని అడుగురా జోగి.. నా ఫేస్ తో నేను గెలిచా రా జోగి అంటూ ఆయన కామెంట్స్ చేసారు. జగన్ ను రమ్మను రా జోగి పోటీకి ఇద్దరం కలిసి పోటి చేస్తాం అన్నారు అన్నారు.