కానీ వైసీపీ ఎంపీలే ఎక్కడ కూడా పెద్దగా హైలైట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. పార్లమెంట్లో ఎలాగో రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దగా పోరాటాలు చేసిన సందర్భాలు కనిపించలేదు. ఇటు రాష్ట్రంలో కూడా ఎంపీ ఫండ్స్తో ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కూడా చెప్పడం లేదు. మెజారిటీ ఎంపీలు ఇదే వరుసలో ఉన్నారు. పేరుకు 22 మంది ఎంపీలు ఉన్నారు....కానీ వీరి వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం కనిపించడం లేదు.
22 మందిలో చాలామంది ఎంపీలు గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. అలాంటి ఎంపీలని నెక్స్ట్ ఎన్నికల్లో జగన్ సైడ్ చేస్తే బెటర్ అని, లేదంటే పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 22 మందిలో 8 మంది ఎంపీలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ 8 మందితో పాటు మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
బెల్లాన చంద్రశేఖర్, బీశెట్టి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, వంగా గీత, మార్గాని భరత్, చింతా అనురాధా, బాలశౌరి, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, సంజీవ్ కుమార్లు ప్రజా వ్యతిరేకతని ఎదురుకునే ఎంపీల లిస్ట్లో ఉన్నారని తెలుస్తోంది. మరి వీరిపై జగన్ స్పెషల్ ఫోకస్ చేసి బలోపేతం చేయాల్సిన అవసరముంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి