ఈ సృష్టి ఒక అద్భుతము... అనంత విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ మానవాళిని ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఆకాశంలో చాలా వింతలు జరిగాయి. తాజాగా జరిగిన మరో వింత అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి లోను చేసింది. చాలా వేల ఏళ్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆకాశంలో అధ్భుతం కనిపించడంతో అంతరిక్ష పరిశోధకులు ఆశ్చర్య పోయారు.  ఏప్రిల్ 26, 27 తేదీల్లో అరుదైన గ్రహాల కూర్పు కనిపించడంతో అవాక్ అయ్యారు. తూర్పున సూర్యోదయానికి ముందు శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చి కనువిందు చేశాయి.

వెయ్యేళ్ల తర్వాత ఇలాంటి ఘటన మళ్ళీ ఆకాశంలో ఆవిష్కృతమైంది. గతం లో ఇదే విధంగా క్రీ. శ. 1947లో చివరి సారిగా ఇటువంటి అద్భుతమైన గ్రహాలు కూర్పు జరిగిందని భువనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ పేర్కొన్నారు.  కొన్ని సైంటిఫిక్ కారణాల వలన ఇవి ఒకే వరుస లోకి వచ్చి చేరుతాయని వారు చెబుతున్నారు.  అయితే ఇలా ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు రావడాన్ని ప్లానెట్ పెరేడ్ అని పిలుస్తారని ఆయన వెల్లడించారు. నిజానికి ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం లేదని ఆయన తెలిపారు.  అయితే సౌర వ్యవస్థ యొక్క గ్రహాలు వరుసగా ఒకే లైన్ లో ఉన్నప్పుడు జరిగే సంఘటనను సూచించుటకు ఖగోళ శాస్త్రంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని పట్నాయక్ తెలిపారు.

ఈ అరుదైన సంఘటన అంతరిక్షంలో అందంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సౌర వ్యవస్థ లోని మొత్తం ఎనిమిది గ్రహాలు చాలా అరుదుగా ఒకే వరుస లోకి వస్తాయని, ఇలాంటి ఘటనలు దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లానెట్ పెరేడ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: