
హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని గడ్కరీ ప్రశంసించారు. ఈ నగరాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో కలిపే జాతీయ రహదారుల అభివృద్ధిని కేంద్రం చేపట్టిందని వివరించారు. హైదరాబాద్-విజయవాడ నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించే ప్రణాళికను ప్రకటించారు. ఇండోర్-హైదరాబాద్ కారిడార్ పూర్తయితే 20 గంటల ప్రయాణం 10 గంటలకు తగ్గుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పర్యావరణ హిత వాహనాలను ప్రోత్సహించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచి, డీజిల్, పెట్రోల్ వాహనాలను తగ్గించాలని సూచించారు. వ్యవసాయంలో కూడా రైతులు పర్యావరణ సమ్మత వాహనాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్లో ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ను హైదరాబాద్ రింగ్ రోడ్పై పరీక్షించాలని మంత్రులకు సూచించారు. ఈ బస్సులు సాధారణ బస్సుల కంటే మూడు శాతం తక్కువ ఛార్జీతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని వివరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు