
పోలీసుల నిరాకరణ ఉన్నప్పటికీ, కవిత తన నిర్ణయంలో దృఢంగా ఉన్నారు. అనుమతి లభించకపోతే ఎక్కడైనా దీక్ష చేపడతానని స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఆందోళన ఉద్దేశమని తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయని, ఈ జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటం చేయడం లేదని ఆమె విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి రిజర్వేషన్ బిల్లులను సాధించిన తీరును ఉదాహరణగా చూపారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఢిల్లీలో ధర్నాలు నిర్వహిస్తోందని కవిత ఆరోపించారు.
బీజేపీ కూడా బీసీలకు మద్దతు ఇస్తామని చెప్పి, రిజర్వేషన్ బిల్లులను నిరోధిస్తోందని విమర్శించారు. తెలంగాణలోని రెండు కేంద్ర మంత్రులు ఈ విషయంలో ఏమీ చేయలేదని ఆమె పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.ఈ ఘటన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై తీవ్ర చర్చకు దారితీసింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు