
బీహార్ ఎలెక్షన్స్ లో గెలవాలి అని.. టేస్టీ టేస్టీ బిర్యానీ ని ఈ కార్యకర్తలు ఏం చేస్తున్నారో చూడండి..!

ఈ క్రమంలో గురువారం రోజు బహదూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి తౌసిఫ్ అలం, తన నామినేషన్ సందర్భంగా ప్రత్యేకంగా ఒక బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన తన నివాసంలో ప్రార్థనలు చేసి, అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల కోసం విందు ఏర్పాటు చేశారు. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది “బిర్యానీ విందు.”అయితే ఆ విందు సమయంలో పెద్ద గందరగోళం నెలకొంది. బిర్యానీ పాకెట్ల కోసం జనాలు క్యూలు కట్టగా, తర్వాత కొంతమంది ఆకలికి తల్లడిల్లి పరస్పరం తోసుకుంటూ, కొట్టుకుంటూ వెళ్లారు. ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
“ఇంత దయనీయ స్థితిలో ఉన్నారా మన భారతీయులు?”.“ఇది రాజకీయ పిచ్చి కాదు, ఆకలి దౌర్భాగ్యం!”,“బిర్యానీ తినిపించి ఓట్లు కొట్టేయాలని చూస్తున్నారా?”అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరికొందరు ఈ ఘటనను చూసి “అక్రమ వలసదారులు మాదిరిగా కొట్టుకుంటున్నారు” అంటూ విమర్శించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో మజ్లిస్ పార్టీ స్పందించింది. వారి ప్రతినిధులు స్పష్టతనిస్తూ,“హనుమాన్ చాలీసా తర్వాత ప్రసాదం ఎలా పంచుతారో, మేము కూడా ప్రార్థన తర్వాత 2000 మందికి బిర్యానీ విందు ఏర్పాటు చేశాం. కానీ జనసందోహం అనుకున్నదానికంటే ఎక్కువగా రావడంతో కొంత గందరగోళం చోటు చేసుకుంది,” అని వివరణ ఇచ్చారు.
అయితే అప్పటికే ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద హీట్ టాపిక్గా మారిపోయింది. బీహార్ ఎన్నికల్లో బిర్యానీ వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ — అన్నీ గాలివానలా విస్తరిస్తున్నాయి. నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు —“బిర్యానీ పార్టీ ఇస్తే ఓట్లు వేస్తామని అనుకున్నావా?“ఇంత సీన్ లేదు నీకు!” అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల సీజన్లో బీహార్ రాజకీయ చర్చల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఒకవైపు రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతుంటే, మరోవైపు బిర్యానీ డిప్లమసీ బీహార్లో ప్రజల మనసుల్లో కొత్త రుచిని తెచ్చేసింది!