టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌, ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన తాజా చిత్రం “తెలుసు కదా”తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌ భాగంగా మేకర్స్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సిద్ధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.సిద్ధు మాట్లాడుతూ —“ఈ సినిమాతో నేను చేసిన పాత్ర పేరు వరుణ్‌. ఇది చాలా ఎమోషనల్‌, అంతర్లీనమైన పాత్ర. చాలామంది ఈ మూవీని యాక్షన్ ఫిల్మ్ అనుకుంటున్నారు, కానీ కాదు — ఇందులో రక్తం చిందించే ఫైట్ సీన్స్ ఉండవు.  ఈ సినిమాలో అసలు ఫైట్ అనేది ఫిజికల్ కాదు, ఇది సైకలాజికల్ ఫైట్. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. మనసుతో, భావోద్వేగాలతో, ఆలోచనలతో జరుగుతుంది. ప్రతి ఒక్క యువకుడికి ఈ పాత్రలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్ పాత్ర” అని పేర్కొన్నారు.

సిద్ధు ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనమే రేపాడు. అభిమానులు, నెటిజన్లు ఈ వ్యాఖ్యలను విభిన్న రీతుల్లో విశ్లేషిస్తున్నారు. కొందరు ఆయన స్పీచ్‌ని సీరియస్‌గా తీసుకుని — “ఇది కొత్త ఆలోచన, సైకలాజికల్ యాక్షన్ అంటే కొత్త ఎక్స్‌పీరియన్స్ అవుతుంది” అని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ట్రోలింగ్ మోడ్‌లోకి వెళ్లారు. “తొడలు కొట్టడాలు, నరకడాలు ఉండవని అంటున్నావు అంటే ఏదైనా స్టార్ హీరోని టార్గెట్ చేస్తున్నావా?” అంటూ సరదాగా, కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ సిద్ధు మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి సినిమా కంటెంట్‌పై ప్రజల్లో కుతూహలం పెరుగుతోంది.

ఈ చిత్రాన్ని నీరజాకోన దర్శకత్వం వహించగా, రాశీఖన్నా మరియు శ్రీనిధి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. టీ జీ విశ్వ ప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మాణంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందింది. టెక్నికల్‌గా, విజువల్‌గా కూడా ఈ మూవీ హై స్టాండర్డ్‌తో తెరకెక్కిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సిద్ధు చేసిన ఈ తాజా కామెంట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి రేసులో “తెలుసు కదా” ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: