గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగానే వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. ఈ వర్షాలు , ఈదురు గాలులు తోడవడంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాను వల్ల కొన్ని ప్రాంతాలలో సెలవులు కూడా మంజూరు చేశారు ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం వల్ల మొంథా తుఫానుగా మారినట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ప్రభావం వల్ల ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావం వల్ల 6 గంటలలో గంటకు 16.k. m వేగంతో మొంథా తుఫాను కదిలింది.


మంగళవారం ఉదయానికి దీని తీవ్రత తుఫానుగా మారే అవకాశం ఎక్కువగా ఉన్నదంటు విశాఖ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల వరకు ప్రభావం ఉంటుందని అలాగే కాకినాడ ఆగ్నేయంగా 680 కిలోమీటర్ల వరకు, చెన్నైకి తూర్పు ఆగ్నేయం 600 కిలోమీటర్ల వరకు ఈ తుఫాను ప్రభావం కేంద్రీకృతమై ఉంటుందంటూ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈ తుఫాను 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీచే అవకాశం ఉన్నదట. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం రోజున తీరం దాటే అవకాశం ఉన్నది.


తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మొంథా తుఫాను దూసుకొస్తున్న తరుణంలో ముందస్తు చర్యల కింద అధికారులకు సెలవులను రద్దు చేసి ,మరి సహాయక చర్యల కోసం రూ . 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసింది. 16 శాటిలైట్ ఫోన్లు, 57 తీర ప్రాంతాలలో 219 తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేసింది. అలాగే సముద్రంలోని 62 మేకనైజ్డ్ ఒడ్డుకు రప్పించేలా చేశారు. సముద్ర తీరంలో పర్యటకుల రాకపోకలను కూడా నిషేధించారు.


అనకాపల్లి, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ వంటి జిల్లాలలో విద్యాసంస్థలు రోజులపాటు సెలవులను ప్రకటించారు. అలాగే ఏలూరు, కడప, పశ్చిమగోదావరి, బాపట్ల వంటి ప్రాంతాలలో రేపటి వరకు విద్యాసంస్థలు సెలవుగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒక్కరోజు సెలవుగా ప్రకటించారు. అన్ని జిల్లాలలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: