మొదటి అంశం ఏమిటంటే ఇటీవలే శ్రీకాకుళంలో జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇన్సిడెంట్ జరగగా, ఇందులో 9 మందికి పైగా మరణించారు. ఈ విషయం పైన చాలామంది నారా లోకేష్ పైన ఒత్తిడి చేశారు. ముఖ్యంగా దేవాలయం కట్టించిన పాండాని అరెస్టు చేయాలని, ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని, కేస్ ఫైల్ చేయాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ వాటిని నిరాకరించి తిరస్కరించారు. వారు భక్తి భావంతోనే కష్టపడి, సొంత డబ్బులతో ఆ గుడిని నిర్మించుకున్నారని ఆ గుడిని తీసుకోవడం తప్పు అంటూ తెలియజేశారు. అలాగే గుడిని మూసివేయాలనే అంశాన్ని కూడా అంగీకరించలేదు. ఈ విషయంలో ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదని సూచించారు.
మరొక అంశం ఏమిటంటే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి క్రైస్తవులు కొంతమంది వేలంగిని మాత దేవాలయం దగ్గరికి వెళ్లారు. అక్కడ నానా రచ్చ నడిచింది. ఆటో డ్రైవర్ల బెదిరింపులు చేశారట. కృష్ణా జిల్లాకు చెందిన క్రైస్తవులు బస్సులో ఎక్కుతున్నప్పుడు ఆటో వాళ్ళందరూ అడ్డం పడిపోయి ఈ బస్సులో వెళ్ళినటువంటి వారితో గొడవకుదిగారు. చంపేస్తామంటూ బెదిరించారు. అయితే అందులో ఉన్నటువంటి ఒక పాస్టర్ నారా లోకేష్ బృందంతో బాగా పరిచయం ఉండడంతో కాల్ చేయగానే వెంటనే లోకేష్ స్పందించి. తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కుమారుడైన ఉదయనిది స్టాలిన్ తో మాట్లాడి పోలీస్ బలగాలను అక్కడ పంపించి దగ్గరుండి సుమారు 30 కిలోమీటర్ల వరకు ఎస్కార్ట్ తో పోలీసులు తీసుకువచ్చి తెలుగు వాళ్ళని ఆంధ్ర బార్డర్ వరకు వదిలిపెట్టేలా చేశారు నారా లోకేష్. దీంతో ప్రాంతీయ భాషా గొడవలు అనేవి లేకుండా చేశారు నారా లోకేష్. ఈ రెండు చోట్ల కూడా చాలా బాధ్యతగా వ్యవహరించారు నారా లోకేష్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి