ఈ కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం 48.76 కోట్ల లడ్డూలు తయారు చేయగా... అందులో దాదాపు 20 కోట్ల లడ్డూలు కల్తీతో కూడినవే! అంటే, ప్రతిరోజూ 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు అందుకునే భక్తులకు, పవిత్రమైన ప్రసాదానికి బదులుగా.. ప్రమాదకరమైన పదార్థాలు అంటగట్టారు. పవిత్ర లడ్డూలో విషం: 40 శాతం పామాయిల్! .. ఇక్కడే అసలైన షాకింగ్ నిజం బయటపడింది. స్వామి వారికి సమర్పించే పవిత్రమైన లడ్డూల్లో 40 శాతం పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్తో పాటు, మరెన్నో ప్రమాదకర రసాయనాలను ఉపయోగించినట్లు సిట్ నివేదిక స్పష్టం చేసింది. వేల కోట్ల విరాళాలు, అపారమైన ఆస్తులు ఉన్న టీటీడీ... కేవలం కొద్దిమంది కాంట్రాక్టర్ల స్వార్థం కోసం భక్తుల నమ్మకాన్ని, ఆరోగ్యాలను పణంగా పెట్టింది.
ఉత్తరాఖండ్లోని భోలేబాబా డెయిరీ, తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, పునబాకలోని వైష్ణవి డెయిరీతో పాటు ఇతర సంస్థల నుంచి నెయ్యి కొనుగోలుకు రూ. 250 కోట్లు చెల్లించారు. ఈ డెయిరీల నుంచే కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు తేలింది. క్షమించరాని నేరం: చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం! .. "లడ్డూల్ని కల్తీ నెయ్యితో తయారు చేసి భక్తుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బ తీశారు" అని సిట్ తన నివేదికలో ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి బాధ్యులైన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకోనున్నారు. పవిత్రతకు మారుపేరైన తిరుమలలో జరిగిన ఈ భక్త ద్రోహంపై రాజకీయ వర్గాల్లో, భక్తుల మనసుల్లో తీవ్రమైన అగ్ని రాజుకుంది. మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వామి వారి సొమ్మును దోచుకున్న ఈ దొంగలకు దేవుడే శిక్ష వేయాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి