మానవులకు అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులలో ఈ వ్యాధి కూడా ఒకటిగా పరిగణించబడిందని WHO సంస్థ తెలియజేసింది ఈ వైరస్ వల్ల మరణాల రేటు ఏకంగా 88% ఉంటుంది. ఈ వైరస్ కూడా సాధారణ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్, ఇతర జంతువులతో సంబంధం ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుందట. ఇథియోఫియా లాంటి ఆఫ్రికన్ దేశాలలో కూడా ఈ వైరస్ గతంలో రావడంతో పెద్ద ఆరోగ్య సంక్షోభాలకు గురిచేసింది. అయితే ఈ వైరస్ ని గుర్తించడానికి అక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయిస్తోంది..
ప్రస్తుతం మార్బర్గ్ వైరస్ కి వ్యాక్సిన్, ప్రత్యేక చికిత్స వంటివి అందుబాటులో లేవని, అందుకే ఈ వైరస్ పరిస్థితి మరింత ఎక్కువగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట సాధారణ ఫ్లూ లాగా కనిపించిన, కానీ ఆ తర్వాత దీని తీవ్రత ఎక్కువ అవుతుందని ప్రజలు ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అంటూ తెలియజేస్తున్నారు. ఇథియోపియాలో ఈ వైరస్ రోజు రోజుకి ఎక్కువగా ప్రభావం చూపడంతో జాగ్రత్తలు పాటించాలని అక్కడివారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి