టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ కూడా అతని క్రికెట్ కి ఫిదా అయిన వాళ్ళు ఎంతోమంది. ఒక సాదా సీదా  క్రికెటర్ స్థాయి నుంచి ఏకంగా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకునే స్థాయికి ఎదిగాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులను సైతం దాసోహం అయిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం తక్కువ సమయంలోనే అలవోకగా చేధించి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక భారత జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జట్టులో అనూహ్యమైన మార్పులు తీసుకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రతి ఒక ఆటగాడు కూడా ఫిట్నెస్ పై దృష్టి పెట్టే విధంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇక అలాంటి విరాట్ కోహ్లీ ఇటీవలే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ముందుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేసాడు. దక్షిణాఫ్రికాలో ఘోరపరాభవం తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ కు వీడ్కోలు పలకడం గమనార్హం.


 టెస్ట్ కెప్టెన్సీ కి వీడ్కోలు పలికిన తర్వాత అటు  సీనియర్ ఆటగాడు గా కొనసాగుతున్న హిట్ మాన్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి వరుసగా సిరీస్ లు గెలుస్తూ వస్తుంది. టీమిండియాలో ఒకప్పుడు కెప్టెన్సీ  తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ  ఇప్పుడు జట్టులో ఒక సాదాసీదా ఆట కలిగి ఉండడం మాత్రం కొంత మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా ఒక ప్లకార్డులు ప్రదర్శించారు అభిమానులు.. ఇందులో రోహిత్ నా కెప్టెన్ రోహిత్  కాదు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కెప్టెన్ కోహ్లీని  తిరిగి కెప్టెన్గా నియమించండి అంటూ రాసి ఉంది ప్రస్తుతం  ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: