మొన్నటికి మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్స్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి బెంగళూరు జట్టుకు నిరాశ తప్పలేదు. అటు ముంబై ఇండియన్స్ కారణంగా అదృష్టవశాత్తు ప్లే ఆఫ్ అవకాశం దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. లక్నో మ్యాచ్లో ఆటగాళ్ళ చెత్త ఫీల్డింగ్ కారణంగా అదృష్టవశాత్తు గెలిచింది. ఇక ఇలాగే అదృష్టం కలిసి వచ్చి టైటిల్ పోరులో కూడా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.


 చివరికి ఒత్తిడిని తట్టుకోలేక రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది బెంగళూరు జట్టు. దీంతో ఇంటి బాట పట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక బౌలర్గా కొనసాగినా మహమ్మద్ సిరాజ్ రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మాత్రం చెత్త ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అనే చెప్పాలి. ఇకపోతే రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్న ఒక రకంగా బెంగళూరు జట్టు ఓటమికి కారణం అయ్యాడు అని చెప్పాలి. కాగా బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. ఇంటి బాట పట్టిన నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా మహమ్మద్ సిరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ఏకంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వార్నింగులు సైతం ఇస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగళూరు ఫైనల్ చేరలేకపోవడానికి ఆ జట్టు పేసర్ మహమ్మద్ సిరాజ్ కారణమని కొంతమంది సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీవల్లే ఆర్ సి బి ఫైనల్ చేరలేకపోయింది అని ఫ్యామిలీని చంపేస్తామంటూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. మరి కొంతమంది ఆర్సిబి అభిమానులు ఆటగాళ్లపై విమర్శలు సహేతుకంగా ఉండాలి అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: