అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత క్రికెటర్ల జీవనశైలి మొత్తం మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక బాగా క్లిక్ అయ్యారు అంటే చాలు కోట్ల రూపాయలు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇలా కోట్లు సంపాదిస్తున్న తర్వాత ఎంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పోతూ ఉంటారు క్రికెటర్లు. ఈ క్రమంలోనే ప్రతి విషయంలో కూడా కాస్త కాస్లీ గానే ఆలోచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకూ ఫైనాన్సిల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడిన వారు సైతం అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత కోట్లు సంపాదించి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి ఇప్పటివరకు ఎన్నో జరిగాయి.

 ఈ క్రమంలోనే క్రికెటర్లు ఇలా ఏదైనా కొత్తగా కొనుగోలు చేశారు అంటే చాలు అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. క్రికెటర్లు ఖరీదైన వాచ్ లేదా కార్ లాంటివి కొంటే.. అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు వెస్టిండీస్ క్రికెటర్ ఒక కొత్త కారు కొనుగోలు చేయడంతో అభిమానులను ఈ వార్త తెగ ఆకర్షిస్తోంది. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఇటీవల తనకు ఇష్టమైన కారు కొన్నాడు.


 ఇక ఈ కొత్త కారు కోసం 2.71 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ బెంజ్ ఏఏంజి జీటి ఆర్ స్పోర్ట్స్ కారు కొన్నాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. ఇకపోతే  ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా వేలంపాటలో 12 కోట్లకు ఈ పవర్ హిట్టర్ ను కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం దక్కించుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 12 మ్యాచ్ లలో 171 స్ట్రైక్ రేట్ తో 326 పరుగులు చేయడమే కాదు 17 వికెట్లు కూడా తీశాడు ఆండ్రూ రస్సెల్..

మరింత సమాచారం తెలుసుకోండి: