దీంతో ఇక రేపు జరగబోయే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీనీ ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్ విరాట్ కోహ్లీకి వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 లలో వంద మ్యాచ్ లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ కోహ్లీ చరిత్ర సృష్టించబోతున్నాడు.
అంతేకాదు విరాట్ కోహ్లీ మరో 7 సిక్సర్లు కొట్టాడు అంటే చాలు టీ20లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత 100 సిక్సర్లు బాదిన రెండవ భారత క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా పొట్టి ఫార్మాట్ లో మరో 374 పరుగులు చేస్తే 11 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రలో నిలిచిపోతాడు. అయితే గత కొంత కాలం నుంచి పేలవమైన ఫాంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఎంత వరకు రాణించగలుగుతాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది ఎలా చెప్పాలి.