జట్టులో ఆటగాళ్లను మారుస్తూ ఎన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం టీమిండియా వెంటే ఉంది. ఈ క్రమం లోనే ఆతిథ్య జట్టుపై కూడా విజయం సాధించింది తిరుగులేదు అని నిరూపించింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేయడం గమనార్హం. గత కొంత కాలం నుంచి అద్భుతంగా రాణిస్తూ ఉన్న టీమిండియా మూడో స్థానం లో నిలిచింది అని చెప్పాలి. 111 పాయింట్ల తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది టీమిండియా. ఈ లిస్టులో 119 పాయింట్ల తో ఇంగ్లాండ్ జట్టు తొలి స్థానం లో కొనసాగుతోంది.
117 పాయింట్ల తో న్యూజిలాండ్ జట్టు రెండవ స్థానం దక్కించుకుంది అని తెలుస్తోంది. ఇక భారత్ తర్వాత నాలుగు,ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మొన్నటివరకు సిరీస్లలో వరుస విజయాలతో పోయిన టీమిండియా ఇటీవలే ఆసియా కప్ లో మాత్రం నిరాశపరిచింది. ఫైనల్ కు వెళ్లకుండా వరుస పరాజయాలతో ఇంటి బాట పట్టింది.