శనీశ్వరుడు ఈ సమస్త భూమండలంపై ఉన్న  జీవుల కర్మలకు తగిన ప్రతి ఫలాన్ని అందించే న్యాయ దేవుడిగా మన హిందూ ధర్మ శాస్త్రంలో చెప్పబడినది. ఈ ప్రపంచానికి వెలుగు పంచే సూర్యుడి యొక్క కుమారులైన శని దేవుడు మరియు యముడు ఇరువురు కూడా న్యాయ దేవుల్లే. అయితే యముడు మరణాంతరం మనుషుల యొక్క కర్మలను బట్టి వారికి శిక్షలు విధిస్తారు. కానీ శనీశ్వరుడు మాత్రం మనిషి బ్రతికి ఉన్న సమయం లోనే వారి వారి కర్మలను బట్టి తగిన శిక్ష వేస్తారు. మంచి కర్మలకు సుఖ సౌఖ్యాలను అందించే ఇదే దేవుడు చెడు కర్మలకు తగిన శిక్షను విధిస్తాడు, హింసకు గురి చేసి నరకాన్ని చూపించే ఉగ్ర రూపాన్ని కలిగి ఉంటాడు. అందుకే మనుషులు చేసే ప్రతి కర్మను ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. ముందు వెనక ఆలోచించి తప్పులు దొర్లకుండా ఇతరులకు నష్టం కలగకుండా నడుచుకోవాలి. ఇక శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు,చల్లని చూపు మన కుటుంబంపై ఉండేందుకు క్రింది మంత్రాలను జపించి  ముక్తి పొందగలరు.

 ఓం శం శనయేనమ
 ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః

 కోణస్ధః పింగళ బభ్రు: కృష్ణో రౌద్రంతకో యమ: సౌరి శనైశ్చరో మంద: పిప్పలాదేవ సంస్తుత:

నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం

ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని

శని జయంతి నాడు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించి శనీశ్వరుని దైవ భక్తితో పూజిస్తే శని యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. అంతే కాకుండా మీరు శని గృహాల చుట్టూ ప్రతి శని వారం ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా ఆ దేవుని ప్రసన్నం చేసుకోగలరు మరియు మీ కష్టాలను కూడా తొలగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: