ఈ రోజుతో ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన ప్రారంభమైన మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 ల సిరీస్ ముగియనుంది. వన్ డే సిరీస్ ను ఎలాగు కోల్పోయిన కివీస్ కనీసం టీ సిరీస్ ను అయినా గెలుచుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ ఇంకా మన కళ్ళముందే మెదలాడుతూ ఉంది అని చెప్పాలి. జట్టులో హిట్టర్లు, వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా కూడా ఒక్క సిక్సు కూడా కొట్టలేకపోవడం నిజంగా దురదృష్టకరం. అస్సలు పిచ్ చాలా నిర్జీవంగా ఉంది.. ఏ మాత్రం బంతి బ్యాట్ మీదకు రాకుండా ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టింది. చివరకు ఆఖరి ఓవర్ అయిదవ బంతికి సూర్య కుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో ఇండియా గెలిచింది.

కానీ ఇండియాను ఆ మాత్రం స్కోర్ ను కూడా చేయకుండా ఇబ్బంది పెట్టిన కివీస్ నైతికంగా గెలిచింది అని చెప్పాలి. కాగా ఈ రోజు అహమ్మదాబాద్ వేదికగా మూడవ మరియు కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లలో కుర్రాడు ఇషాన్ కిషన్ పెద్దగా చేసింది ఏమీ లేదు.. ఇక శుబ్మాన్ గిల్ సైతం ఫెయిల్ అయ్యాడు, వచ్చిన సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవడంలో సన్ రైజర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి విఫలం అవుతున్నాడు. దీనితో చివరి మ్యాచ్ కు జితేష్ శర్మ మరియు పృద్వి షా లకు అవకాశం ఇచ్చి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిరీస్ కోసం జరిగే మ్యాచ్ కదా.. ఈ సమయంలో ప్రయోగాలు అవసరమా అని కూడా సందేహం రావొచ్చు.. కానీ పృథ్వి షా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉంది.

ఒక్క ఛాన్స్ ఇస్తే జట్టులో ఉన్నందుకు కాస్త సంతృప్తి ఉంటుంది. ఇక నెక్స్ట్ సిరీస్ లలో రోహిత్ మరియు కోహ్లీ లు వస్తే వీరికి చోటు దక్కడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్ లో కుదరితే ఇద్దరికీ లేదంటే పృథ్వి షా కు అయినా ఆడే ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది అభిమానుల అభిప్రాయం. మరి టీం కోచ్ మరియు కెప్టెన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాలంటే టాస్ వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: