గత ఏడాది టీమిండియా తో జరిగిన మ్యాచ్ లో గజ్జల గాయం బారినపడిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే గాయం తీవ్రం కావడంతో 9 నెలలు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారు అంటూ ఓ ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ తెలిపినట్లు ఒక వార్త వైరల్ గా మారింది. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్ కి డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం లేదు అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టడం తో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడు అని వస్తున్న వార్తల పై ఇటీవల స్పందించిన డేవిడ్ వార్నర్ క్లారిటీ ఇచ్చాడు.
గాయం తాలూకు బాధ తొమ్మిది నెలల వరకు ఉంటుంది అన్న విషయం తానే చెప్పానని.. అయితే మార్చి నుండి జరగబోయే ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో తాను ఆడబోతున్నాను అంటూ డేవిడ్ వార్నర్ క్లారిటీ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఇక ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో కూడా ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెండేళ్ల నిషేధం తర్వాత డేవిడ్ వార్నర్ గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అడుగుపెట్టాడు అన్న విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడబోతున్నాడు అన్న దానిపై క్లారిటీ రావడంతో ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో సన్రైజర్స్ జట్టు టైటిల్ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు అభిమానులు.