ఇక గ్రేటర్ నోయిడా లో  ఆటో ఎక్స్ పో 2023 పూర్తి అయిపోయింది. ఈ ఈవెంట్ లో చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ ఈ బైక్ లు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కోవలో దేశీయ స్టార్టప్ కంపెనీ అయిన డీవోట్ మోటర్స్ కూడా తమ కొత్త బైక్ ను లాంచ్ చేయడం జరిగింది.సూపర్ లుక్ తో వున్న తమ ఎలక్ట్రిక్ బైక్ డీవోట్ ను పరిచయం చేసింది. ఈ బైక్ డిజైన్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ట్యాంక్ నుంచి బ్యాటరీ ప్రాంతం దాకా పూర్తిగా ప్యాక్ చేసినట్లు ఉండడంతో ఈ బైక్ చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన బైక్ అని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుందని తెలిపారు. ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించిన బైక్స్ లో ఈ కొత్త స్టార్టప్ కంపెనీ ఈ బైక్ లాంచ్ తో తన ప్రత్యేకతను నిలుపుకుంది. ఈ బైక్ లో వచ్చే అప్డేటెడ్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ డీవోట్ ఎలక్ట్రిక్ బైక్ లో 9.5 కేడబ్ల్యూ అప్డేటెడ్ పనితీరు  బ్యాటరీను ఫిక్స్ చేశారు. అది కేవలం మూడు గంటల్లో  పూర్తిగా చార్జ్ అవుతుంది.


అలాగే ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 200 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంకా అలాగే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు మొత్తం 120 కిలో మీటర్లు ఉంటుంది. డీవోట్ మోటార్స్ యూకేలో తన ఆర్ అండ్ డీ సెంటర్ ఉందని ప్రకటించింది. ఇంకా అలాగే ఈ బైక్ డెవలప్మెంట్ సెంటర్ రాజస్థాన్ లో ఉంది. కాబట్టి తమ బైక్స్ ను 90 శాతం దాకా భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.డీవోట్ ఈ-బైక్ లో అప్డేటెడ్ టీఎఫ్ టీ స్క్రీన్, యాంటీ థెఫ్ట్ తో కీలెస్ స్టార్ట్-స్టాప్ ఇంకా అలాగే అదనపు టైప్ 2 చార్జింగ్ పాయింట్ వంటి చాలా ఫీచర్లనేవి ఉంటాయి. బ్యాటరీ ను సురక్షితంగా ఉంచడానికి లిథియం ఎల్ ఎఫ్ పీ బ్యాటరీ కెమిస్ట్రీ ఉంటుంది. ఇది థర్మల్ మేనేజ్ మెంట్ సమస్యల నుంచి బ్యాటరీను కాపాడుతుందని కంపెనీ వారు చెబుతున్నారు. తమ ఈ బైక్ లు అప్డేటెడ్ టెక్నాలజీ  ఇంకా అలాగే చాలా అద్భుతమైన కాన్ఫిగరేషన్ తో డీవోట్ ఎలక్ట్రిక్ బైక్ లు ఈ బైక్ సెగ్మెంట్ ను మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతుందని ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ వరుణ్ దేవ్ పన్వార్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: