హూండా కస్టమర్లకు తాజాగా ఒక గుడ్ న్యూస్ అందిస్తోంది.ఇప్పుడు ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మార్కెట్లోకి సరికొత్త వాహనాలు కూడా వస్తున్నాయి..ఇప్పుడు తాజాగా ప్రత్యేకమైన విద్యుత్ సైకెల్ ను కూడా తీసుకువస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల తరువాత ఎలక్ట్రిక్ కార్లకు కూడా భారీగానే డిమాండ్ పెరుగుతున్నది.. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వంతు రానే వచ్చేసింది. గత కొన్నేళ్లుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపుగానే మక్కువ చూపుతున్నారు. దీంతో పలు రకాల టూ వీలర్ త్రీ వీలర్స్ సైతం మార్కెట్లోకి వస్తున్నాయి.


అయితే ఈసారి జపాన్ కి చెందిన హూండా ఒక అద్భుతమైన సైకిల్ని తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సరికొత్త ఫీచర్స్ ని కలిగి ఉన్నది. ధర కూడా చాలా చౌక ధరకే కలిగి ఉన్నది. కేవలం రూ .2000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే ఈ సైకిల్ ని పొందవచ్చు.. ఈ సైకిల్ పేరు హూండా E-Mtb ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఒకసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కేవలం మూడు గంటలలోనే చార్జింగ్ చేసుకోవచ్చు.


ఈ అత్యధిక ఎలక్ట్రిక్ సైకిల్ 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుందట..దీని అసలు ధర రూ .20వేల రూపాయలు కాగా కేవలం రూ .2000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సైతం మనం తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని వాయిదా పద్ధతులలో చెల్లిస్తే సరిపోతుంది.. మార్కెట్లో కూడా ఎన్నో రకాల వివిధ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విడుదలవుతున్నాయి. వాటన్నిటిని మించి ఫీచర్స్ తో హూండా ఎలక్ట్రిక్ సైకిల్ వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సహాయంతో మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులువుగా వెళ్ళవచ్చు. మరి ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్నిహూండా కంపెనీ అధికారిక వెబ్సైట్లో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: