ఈ ఏడాది 25 వ తేదీన ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతాయట. ఇది ప్రజల పైన ఎంతో ప్రభావం చూపబడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఒక పోస్టు చేశాడు. అది వైరల్ గా మారుతుంది. అసలు విషయం ఏమిటంటే..tiktok లో ఉండేటువంటి 5 mtt అనే యూజర్ కి వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ ని సంపాదించారు. అతడి ఇలాంటి పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. దీని తో పాటుగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


తాజాగా టైం ట్రావెల్ అనే పద్ధతి ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అయ్యింది. అంటే సాధారణ మనుషులు సైతం జరగబోయే విషయాలను జరిగే విషయాలను కూడా చెప్పే పద్ధతి అన్నమాట. తాజాగా ఇలాంటి పద్ధతులను కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.."అద్భుతం"బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 వంటి సినిమాలు కూడా ఈ కోవకు చెందినవే. ఇక ఇదే కాకుండా సూర్య నటించిన 24 మూవీ, ప్లే బ్యాక్ వంటి మూవీ లు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రభావం ఏమో కానీ, ఈ టైం ట్రావెల్ గురించి ఇప్పుడు ఎక్కువగా నెట్లో వెతుకుతున్నారు నెటిజన్స్.


దాదాపుగా కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి.. టిక్ టాక్ లో ట్రావెల్ ట్రైన్ గురించి ఒక పోస్టు చేశాడు. దాంతో అతను బాగా ఫేమస్ అయ్యాడు. తను 2027 వ ఏడాది నుంచి వచ్చానని.. తనే ఈ ప్రపంచంలో కల్లా చివరి వ్యక్తి అని తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి కనుమరుగై పోయాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఏం చెబుతున్నాడంటే. డిసెంబర్ 20వ తేదీ నుంచి సూర్యుడి నుంచి కొన్ని శక్తులు మనుషులకు వెలువడతాయట, ఆ తర్వాత 5 రోజులకు ఒక అద్భుతం జరుగుతుందని తెలియజేశాడు.. ఇదంతా నేను మీకంటే ముందు కాలంలో కి వెళుతున్నాను కాబట్టి చెబుతున్నాను అంటూ తెలియ చేశాడు. ఈ విషయం బాగా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: