రోజు రోజుకి మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు.. కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా.. ఆగని కామాందుల ఆగడాలు. ఆడదానిగా పుట్టడం పాపామే అనుకుంటున్న మహిళలు. ప్రతీరోజు పేపర్ లో, టీవీ ఛానల్స్ లో ఎక్కడ చూసినా ఇవే వార్తలు. ఇలాంటి దారుణాలకు అంతం లేదా. ప్రభుత్వం నిందితులకు సరైన శిక్ష విధించడం లేదా.. ఇంలాంటి పరిణామాలుతో ఆడపిల్లలని కన్నాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది నేటి సమాజంలో ...


మొన్న ఆయోషా, నిన్న దిశ, నేడు మరొకరు, రేపు ఇంకొరకు ఇలా ప్రతీ రోజు ఏదో ఒక మహిళ పేరు మారుమ్రోగుతూనే ఉంది. ర్యాలీలు, నిరసనలు ఇలా అత్యాచారాలను రూపుమాపేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నా అవన్నీ బూడిలో పోసిన పన్నీర. ఇలాంటి ఘటనలు దేశం మొత్తాన్ని కలచివేస్తున్నాయిరు గానే మిగిలిపోతుంది. దుర్మార్గులను చంపేయండి అంటూ ప్రజలందరూ తమ గళం ఎత్తి వినిపిస్తున్నారు. 

 

ఈ దారుణాలన్నీ ఒకే కోమణంలో జరుగుతున్నాయి. అత్యాచారం చేసి నరరూప రాక్షసుల్లా ఆడదాని జీవితాన్ని నాషనం చేస్తున్నారు. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు మానవ మృగాలు చలరేగిపోతున్నారు. తాజాగా నల్గొండలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. నకిరేకల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో  కూర్చొని ఒంటరిగా టీవీ చూస్తోంది. ఆమె భర్త బయటికి వెళ‌్ళి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన పి.బాలకృష్ణనాయక్ ఇంట్లోకి  ప్రవేశించాడు. బలవంతంగా ఆ మహిళను గదిలోకి ఎత్తుకెళ్లి ఆమె అరవకుండా నోట్లో దుస్తులు కుక్కాడు. 

 

అంతటితో ఆగకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె ఏంచేయలేకపోయింది. 
రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు విషయం తెలియజేసింది. ఆమెను బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: