భారత దేశంలో కియా కార్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో ఎన్నో కొత్త ఫీచర్ల తో ఉన్న కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే, తాజాగా అప్డేటెడ్ వర్సన్ ఫీచర్ల తో మరో కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ కారు ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..


ఈ కియా సంస్థ నుంచి మార్కెట్లోకి భారతదేశపు మొట్టమొదటి ఎంపివి కారు అయిన కార్నివాల్ విడుదలైంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి సెల్టోస్, కియా సోనెట్లను కూడా భారత దేశంలో కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన కార్నివాల్ కారు... టయోటా ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి కార్ల తో పోటీ పడనుంది. కియా కార్నివాల్ ప్రీమియం ఎంపీవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని పరిమాణం చాలా పెద్దది. కార్నివాల్ యొక్క ప్యాసింజర్ కంపార్ట్మెంట్ ప్రవేశానికి స్లైడింగ్ తలుపులు ఉన్నాయి, దీంతో కారులో కూర్చోవడం సులభం అవుతుంది.


కెప్టెన్ సీట్లు దాని రెండవ వరుస లో కనిపిస్తాయి. కానీ భారతదేశం లోని కంపెనీలు 7 మరియు 8 సీటింగ్ లేఅవుట్‌ల తో దీన్ని అందించే అవకాశం ఉంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా శక్తినివ్వనుంది, ఇది గరిష్టంగా 202 పిఎస్ శక్తిని మరియు గరిష్టంగా 440 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ ఆటో మేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కార్నివాల్ యొక్క ఇండియన్ వెర్షన్‌లో, ఈ రెండు ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్ల ను కంపెనీ అందించగలదని భావిస్తున్నారు. ఇకపోతే ఇండియన్ మార్కెట్ ఈ కారు ధర చూస్తే.. 27 లక్షల నుంచి రూ .36 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారుతో టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి పూర్తి సైజు ఎస్‌యూవీ పోటీ పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: