ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ప్ర‌భుత్వానికి పెద్ద గుండెకాయ వంటిద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వ‌యంగా చెపుతున్నారు. అందుకే వ‌లంటీర్ల‌ను మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు జ‌గ‌న్ మ‌రిన్ని ప్రోత్సాహ‌కాలు ప్రవేశ పెడుతున్నారు. అయితే ఈ వలంటీర్ల‌పై జ‌గ‌న్ కేబినెట్లోని ఓ మ‌హిళా మంత్రి.. అందులోనూ డిప్యూటీ సీఎంగా ఉండి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

వ‌లంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. కురుపాం నియోజకవర్గలో కొన్ని మండలాల్లో వైసీీప, జగన్ కు వ్యతిరేకంగా కొందరు వ‌లంటీర్లు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గరుగుబిల్లి మండలంలో ఒక వ‌లంటీర్ భర్త ఎన్నికల్లో పోటీ చేశారని పుష్పశ్రీవాణి ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: