ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అయ్యన్నపాత్రుడు చర్చనీయాంశంగా మారుతున్నారు, తాజాగా గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పై నమోదైన కేసులో 41 ఏ ప్రకారం వ్యవహరించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నకరికల్లు పోలీస్ స్టేషన్ లో తనపై నమోదైన కేసులపై హైకోర్టును అయ్యన్నపాత్రుడు ఆశ్రయించారు, అయ్యన్నపాత్రుడు తరఫున హైకోర్టు న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారని వెంకటేష్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో ముఖ్యమంత్రి పట్ల చేసిన ప్రసంగంపై మాజీ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా సీఆర్పీసీ లోని 41 ఏ ప్రకారం నోటీసులిచ్చి నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చూడాలి ఈ నకరికల్లు కేసు విషయంగా ఏం జరగనుంది అనేది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: