లోయ‌లో ప‌డిన బ‌స్సు దుర్ఘ‌ట‌న‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. బెల్లంప‌ల్లి నుంచి హ‌నుమ‌కొండ వెళ్తున్న బ‌స్సు  ప్ర‌మాద‌వ‌శాత్తు లోయ‌లో ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న విచారం వ్యక్తం చేస్తూ గాయపడిన వారిని ఆదుకుంటామని అన్నారు. గాయ‌ల‌కు గురైన బ‌స్సులోని ప్ర‌యాణీకుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందే విధంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ ఆర్‌.ఎం.ల‌ను ఆదేశించారు మంత్రి పువ్వాడ అజయ్.

క్ష‌త‌గాత్రులకు కావ‌ల్సిన వైద్య సేవ‌ల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు ఈ సందర్భంగా సూచించారు.  గాయాల‌కు గురైన ప్ర‌యాణీకులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ  బాధిత కుటుంబ‌స‌భ్యుల‌కు త‌మ విచారం వ్య‌క్తం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ . ఇక ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts