సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఊరేగింపు చేపట్టారు. డీజే పాటల మధ్య దుర్గామాతను ఊరేగించారు. డీజే సౌండ్ విని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డీజే పాటలు ఆపాలని నిర్వాహకులకు సూచించారు. ఉన్నట్టుండి బుడ్డోడు ఎస్సైని ప్రశ్నించాడు. డీజే ఎందుకు పెట్టవద్దు సార్.. దుర్గమాత ఊరేగింపుకు డీజే లేకుంటే ఎలా..? అని పేర్కొన్నాడు. ఆరేండ్లు ఉన్న ఈ బుడతడు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం.. కానీ ఇప్పుడు డీజే మాత్రం పెట్టాల్సిందే అని ప్రశ్నించిన విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఊరేగింపు చేపట్టారు. డీజే పాటల మధ్య దుర్గామాతను ఊరేగించారు. డీజే సౌండ్ విని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డీజే పాటలు ఆపాలని నిర్వాహకులకు సూచించారు. ఉన్నట్టుండి బుడ్డోడు ఎస్సైని ప్రశ్నించాడు. డీజే ఎందుకు పెట్టవద్దు సార్.. దుర్గమాత ఊరేగింపుకు డీజే లేకుంటే ఎలా..? అని పేర్కొన్నాడు. ఆరేండ్లు ఉన్న ఈ బుడతడు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం.. కానీ ఇప్పుడు డీజే మాత్రం పెట్టాల్సిందే అని ప్రశ్నించిన విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.