ఇక డ్రై స్కిన్‌కి తేమను తెచ్చి మెరిసేలా చేయడానికి.. ముల్తానీ మట్టితో ఇలా ఫేస్ ప్యాక్‌ను తయారు చేయండి.ముందుగా 1 స్పూన్ ముల్తానీ మట్టి, 3 టేబుల్ స్పూన్ల పాలు,పావు టీస్పూన్ తేనె,ఒక టీస్పూన్ కలబంద జెల్ వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి.. మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ముఖం మీద ఉంచండి. ఇక ఇది పూర్తిగా ఆరిపోయిన వెంటనే మంచినీటితో శుభ్రం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. వర్షకాలంలో మీ చర్మం బాగా నిగనిగలాడుతుంది.ఇంకా చర్మం జిడ్డుగా ఉన్నవారు.. వేసవి ఇంకా వర్షాకాలంలో మరింత సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే వర్షకాలంలో నూనె గ్రంథులు అనేవి మరింత చురుకుగా మారి ముఖం జిగటగా తయారవుతుంది. అయితే ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి పలు ముల్తానీ మట్టితో తయారు చేసిన మిశ్రమాన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


1 స్పూన్ ముల్తానీ మిట్టి,1 స్పూన్ కలబంద జెల్,1 స్పూన్ గంధపు చెక్క పొడి ఇంకా 2 నుంచి 3 టీస్పూన్లు రోజ్ వాటర్ ఇక వీటన్నింటిని కూడా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవాలి..చర్మంపై దీనిని అప్లై చేసి ఒక 25 నిమిషాల పాటు అలాగే ఉంచి.. మంచి నీటితో బాగా శుభ్రం చేయాలి.ఇంకా అలాగే చర్మంపై కొన్ని చోట్ల జిడ్డుగా, మరి కొన్ని చోట్ల పొడిగా కూడా మారుతూ ఉంటుంది.ఇలాంటి మిక్స్డ్ స్కిన్ టైప్ చర్మాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.1 స్పూన్ ముల్తానీ మట్టి ఇంకా 1 స్పూన్ రోజ్ వాటర్,1 టీస్పూన్ అలోవెరా జెల్ ఇంకా అలాగే అర టీస్పూన్ తేనె వీటన్నింటిని కూడా బాగా కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచండి. మీ చర్మం జిడ్డుగా ఉన్న చోట, ఆయిల్ బ్యాలెన్స్ ఉండి, ఇంకా చర్మం తేమగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: