క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. కొంద‌రు కుటుంబ స‌భ్య‌లతో హాయిగా గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు వినోద‌భ‌రిత‌మైన వీడియోలు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ నుంచి మ‌న‌ల్నిమ‌నం కాపాడుకోవ‌డానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సెల‌బ్రిటీలు అయితే.. బీ ద రియ‌ల్ మ్యాన్ అనే ఛాలెంజ్‌లో మునిగితేలుతున్నారు.

 

అయితే.. లాక్‌డౌన్ స‌మ‌యంలో బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఏం చేస్తున్నార‌ని అనుకుంటున్నారా..? ఆయ‌న ఈ స‌మ‌యాన్ని పుస్త‌క ప‌ఠానికి కేటాయిస్తున్నారు. తాను చ‌దివిన పుస్త‌కం గురించి ట్వీట్ చేశారు. * పుస్త‌కాలు లేని గ‌ది ఆత్మ‌లేని శ‌రీరం. యానిస్ వ‌రూఫాకిస్ రాసిన టాకింగ్ టు మై డాట‌ర్ పుస్త‌కాన్ని చ‌దివేందుకు లాక్‌డౌన్ స‌మ‌యాన్ని వినియోగించుకున్నా.. ఈ డిజిట‌ల్ యుగంలో పుస్త‌క ప‌ఠ‌న ఆస‌క్తిని ప్ర‌జ‌ల్లో పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంది* అంటూ అమితాబ్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: