లాక్‌డౌన్ నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేష‌న్‌కార్డుదారులంద‌రికీ బియ్యంతోపాటు రూ.1500 అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే..  ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వరుసగా కనీసంగా 4.50 లక్షల మంది లబ్ధిదారులు కార్డు ఉండికూడా రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. వారికి ప్రభుత్వం తరఫున అందిస్తున్న రూ.1,500 సాయాన్ని నిలిపివేసింది. దీంతో పౌర సరఫరాల శాఖకు రూ.67 కోట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, 3 నెలలుగా రేషన్‌ తీసుకోని కుటుంబాల సంఖ్య ఒక్కో నెల ఒక్కోలా ఉంది. కాగా, ఆర్థికంగా ఆదుకునేందుకు రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.1,500 ఆర్థికసాయాన్ని అందిస్తోంది.

 

అయితే తొలి విడతలో 74లక్షల మందికి, రెండో విడతలో 5.21 లక్షల మందికి పంపిణీ చేస్తోంది. మూడో విడతలో మరో 3లక్షల మందికి రూ.45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం కాగా, మరో లక్ష కుటుంబాలకి బ్యాంకు ల్లో డబ్బులు వేసే ప్రక్రియ కొనసాగుతున్న‌ది. ఇంకా మరో 4.50 లక్షలమంది కుటుంబాలు పూర్తిగా రేషన్‌ తీసుకోనివే. ఇక‌ వీరికి రూ.1,500 ఇవ్వకూడదని ఆ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. రేష‌న్ బియ్యం తీసుకోనివారికి ప్ర‌భుత్వ సాయం ఎందుక‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: