దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 743 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,191కు చేరింది.
తాజాగా కరోనా వల్ల మరో ముగ్గురు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. బుధవారం సాయంత్రం వరకు 5882 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రధానంగా కోయంబేడు మార్కట్ కారణంగా ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందిందని నిపుణులు చెబుతున్నారు. ఈపరిణామాల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.